త్రాగునీటి కోసం రోడ్డెక్కిన గిరిజనం...
నర్సీపట్నం (జన హృదయం): త్రాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతూ ఖాళీ బిందెలతో ఆర్డిఓ ఆఫీస్ ఎదుట మహిళల ధర్నా నిర్వహించారు. అధికారుల చుట్టూ తమకు త్రాగు నీరు అందించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం పొగ చెట్ల పాలెం గ్రామానికి చెందిన గిరిజనులు తమకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతూ నర్సీపట్నం ఆర్డీవో ఆఫీస్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ డి ఓ ఆఫీసులో వినతిపత్రం సమర్పించారు ఈ ధర్నాకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వహించింది.
Comments
Post a Comment