పుస్తక పఠనం అలవాటుగా మారాలి
శ్రీకాకుళం, (జనహృదయం) : నగరంలోని బలగ హడ్కోకాలనీ శాఖా గ్రంధాలయంలో గురువారం 52 వ గ్రంధాలయ వారోత్సవ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, డీఎస్పీ ప్రసాదరావు ముఖ్య అతిదుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జవహార్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం, నెహ్రూ జయంతి వేడుకలు ఒకే రోజున నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పుస్తక పఠనానికి ప్రస్తుత తరం పెంపొందించుకోవాలని, గ్రంధాలయాల్లో ఉన్న విజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. . శెలవు దినాల్లో కూడా గ్రంధాలయాలు పనిచేస్తూ మన విజ్ఞానం కోసం కృషి చేస్తున్నాయన్నారు.
Comments
Post a Comment