నేడు గవర్నర్ విశాఖ పర్యటన
విశాఖపట్నం : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు నగరానికి రానున్నారు. ఈ రోజు ఉదయం ఆయన నగరానికి చేరుకుని వుడా పార్కులో జరుగుతున్న 57వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలకు హాజరవుతారు.
సాయంత్రం హోటల్ నోవాటెల్కు చేరుకుని 20వ ఆలిండియా పోలీస్ లాన్ టెన్నిస్ చాంపియన్షి్ప-2019 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సర్క్యూట్ హౌస్కు చేరుకుని, అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ బయలుదేరి వెళతారు
Comments
Post a Comment