'వైయస్సార్ నేతన్న నేస్తం' పథకం ప్రారంభించిన సీఎం...
అనంతపురం జిల్లా ధర్మవరంలో బహిరంగ సభ...
ధర్మవరం: వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ధర్మవరం జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల సాయం 81,783 చేనేత కుటుంబాలకు రూ.196.27 కోట్ల సాయం అందిస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి చేనేత కుటుంబానికి మొత్తం రూ.1.20 లక్షలు టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకూ ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సహాయం. రూ.3.5 కోట్ల వ్యయం అనంతపురం జిల్లాలో 57 మంది చేనేతకారుల కుటుంబాలకు సహాయం చేస్తామన్నారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా రాజకీయ స్వార్ధంతో శత్రువుల చర్యలు, విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారని జగన్ ఆవేధన చెందారు. అయితే ఎవరేం చేసినా ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ నాకు కొండంత బలంగా ముందుకు సాగుతున్నానన్నారు. గత ప్రభుత్వం ఆప్కోను స్కామ్లు, లంచాల మయం చేసిందని, వాటిపై దర్యాప్తు జరుగుతుందన్నారు. నెల రోజుల్లో అన్నీ బయటకు వస్తాయని ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రతి చేనేతకారుడికి మంచి చేసే ముందుకు సాగుతామన్నారు.
ఇచ్చిన హామీలు 6 నెలల్లోనే అమలు
ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు, పేద వర్గాలకు మేలు చేసే విధంగా నవరత్నాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు భరోసా ఇస్తూ వారికి పెట్టుబడి సహాయం చేయడంతో పాటు, ఆటో, టాక్సీలు, క్యాబ్ల డ్రైవర్లకు ఆర్థిక చేయూతనిచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతకారులు ఆత్మహత్య చేసుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం గుర్తు చేశారు. అందుకే 2014-19 మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 57 మంది చేనేతకారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. వైయస్సార్ నేతన్న నేస్తం పథకంలో ఇప్పటి వరకు 81,783 మంది అర్హులను గుర్తించగా, వారిలో ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 27 వేల మంది ఉన్నారు. ఈ పథకం కోసం రూ.196.27 కోట్లు కేటాయించారు. దీంతో ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన మరో హామీని సీఎం వైయస్ జగన్ అమలు చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా రెండు గంటల్లోనే మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ సహాయం జమ అయింది. అంతకు ముందు ఆయన చేనేత జౌళి శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు.
Comments
Post a Comment