పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సమీక్ష

 


అమరావతి:  రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.  దుగ్గజరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.  మొదటి  ఫేజ్‌లో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణం పై, చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సీఎం ఆదేశం.


మచిలీపట్నం పోర్టును వీలైనంత వేగంగా కట్టడానికి చర్యలు తీసుకోవాలి. సీఎం
ఈ పోర్టుకుఇప్పటికే భూమి అందుబాటులో ఉంది
మిగిలిన పోర్టులు నిర్మాణం చేసేచోట అవసరమైన భూమిని వెంటనే సేకరించుకోవాలి. సీఎం
మచిలీపట్నం పోర్టుకు వచ్చే జూన్‌నాటికి ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తిచేస్తామన్న అధికారులు.
రామాయపట్నం పోర్టుకు వచ్చే జూన్‌నాటికి ఫైనాన్షియల్‌క్లోజర్‌ పూర్తిచేస్తామన్న అధికారులు 
మే, జూన్‌నాటికి రెండు పోర్టులకూ శంకుస్థాపన.
విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తానని కేంద్రం చెప్పిందనిి, ఆ మేరకు నిధులను కేంద్రం నుంచి ఇప్పించుకునేలా చర్యలు చేపట్టాలి. సీఎం.
అధికారులతో చర్చ సందర్భంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించిన సీఎం.
ఎవరైనా మీ ప్రాధాన్యతలు ఏంటని అడిగితే నా తొలి ప్రాధాన్యత నవరత్నాలు, నాడు– నేడు కార్యక్రమం అని చెప్తా. అధికారులతో ముఖ్యమంత్రి
తర్వాత ఇళ్ల నిర్మాణం, ప్రతి ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది రెండో ప్రాధాన్యత అంటాను. ముఖ్యమంత్రి
రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు వెళ్తున్న కాల్వల విస్తరణ మూడో ప్రాధాన్యత.
పోలవరం ఎడమ కాల్వద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరో ప్రాధాన్యత. 
పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌ అక్కడనుంచి బనకచర్లకు గోదావరి జలాలు మరో ప్రాధాన్యత :
ప్రతి జిల్లాకు తాగునీటిని అందించాన్న వాటర్‌ గ్రిడ్‌ మరో ప్రాధాన్యత.
ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసారంగంలో స్థిరత్వం ఉంటుంది.
అలాగే కరవు ప్రాంతాలకు ఊరట లభిస్తుంది. సీఎం
నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుంది. సీఎం
విద్యుత్‌ సంస్కరణల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించిన ముఖ్యమంత్రి ప్రతి ఏటా విద్యుత్‌ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తున్నాం. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే 12వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు ఇస్తే సరిపోతుంది: 
సుమారు రూ. 35–37వేల కోట్ల ఖర్చుతో 12వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది:
అంటే మూడు, నాలుగు సంవత్సరాల్లో ట్రాన్స్‌కోకు ఇస్తున్న సబ్సిడీ డబ్బుతో 12వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. ఈదిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా