జగన్ కే జై కొట్టిన చిరంజీవి...
రాష్ట్రంలో మూడు రాజధానులు హర్షనీయం...
మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి
అమరావతి : అధికార,పరిపాలన వికేంద్రీకరణతో అభివ ద్ది సాధ్యమవుతుందని మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు చిరంజీవి అన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాభివ ధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా క షి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. అమరావతి - శాసన నిర్వాహక , విశాఖపట్నం- కార్యనిర్వాహక, కర్నూలు -న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు. ఏపీలో వివిధ ప్రాంతాల అభివ ద్దికై నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక, ఆర్ధిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. అభివ ద్ధి , పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీక తమైందని, ఉమ్మడి రాష్ట్రంలో మిగితా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందన్నారు.
సాగు,తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలుస కూలీల బిడ్డల భవిష్యత్ కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుంది. ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు ,అభద్రతాభావాన్ని తొలగించాలి. వాళ్లు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలు నివారించే ప్రభుత్వం కృషిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Post a Comment