పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ అవసరం...


శ్రీకాకుళం (జనహృదయం) :  శ్రీకాకుళం గ్రామీణ మండలం  పెద్ద పాడు గ్రామం లో ఉన్నత పాఠశాలలో గురువారం  ఉదయం  ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో  భాగంగా విద్యార్థుల చేత మార్షల్ ఆర్ట్స్, ఏరోబిక్ , యోగ మెడిటేషన్, వ్యాసరచన పోటీలు, మొదలైనవి ఏర్పాటుచేశారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ లో   బాగా తర్ఫీదు పొందాలని కోరారు., ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు,  విద్యార్థులను తర్ఫీదు ఇస్తున్న  వ్యాయామ ఉపాధ్యాయుడు  గుండ బాబు మోహన్ కు ప్రత్యేక అభినందలు తెలిపారు,ఈ కార్యక్రమంలో పాఠశాలలో  ఉపాధ్యాయులు  పి.సత్యవతి, ఎస్ .వి. కృష్ణారావు, ఎం. శాంతారావు, జి .భూషన్ రావు, డి .యమ్ .మల్లేశ్వరి, కే. సురేష్ కుమార్, క్రాఫ్ట్ బి. త్రివేణి, ఆర్ట్ సిహెచ్. రవికుమార్, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా