రాష్ట్రంలో రెడ్డిరాజ్యం.... కీలక పదవుల్ని రెడ్లకేనా...
రాష్ట్రఖజానా నుంచి సాక్షి సిబ్బందికి జీతభత్యాలా... ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
అమరావతి : రాష్ట్రంలో రెడ్ల రాజ్యం ఏలుబడిలో ఒకేసామాజకివర్గపరిధిలోకి వెళ్లిపోయిందని, పదవులన్నీ ఆవర్గానికే కట్టబెట్టారని, రాష్ట్రాభివ ద్ధికోసం పనిచేసిన తెలుగుదేశంప్రభుత్వంపై కులముద్రవేసిన నాటిప్రతిపక్షపార్టీ, అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో రెడ్డిరాజ్యాన్ని నడుపుతోందని టీడీపీ సీనియర్నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేరుకేమో బడుగు, బలహీనవర్గాలకు, దళితులకు పెద్దపీట వేస్తున్నామంటూ, పెత్తనమంతా జగన్వర్గమే చేస్తోందన్నారు. కమ్మజాతిలో పుట్టడమే నేరమన్నట్లుగా, నిజాయితీగా తమపనితాము చేసుకుంటున్న పోలీస్ అధికారుల్ని ఏవిభాగంలోను విధులు నిర్వహించనీయకుండా ప్రభుత్వం ఎందుకు వీఆర్కి పంపిందని ఆయన నిలదీశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 37మంది డీఎస్పీలను ప్రమోట్చేస్తే, వారిలో 9మంది బీసీలు, 7గురు రెడ్లు, 7గురు ఎస్సీలు, 4గురు కాపులు, ఇద్దరేమో కమ్మవారుంటే, మొత్తం 35మంది కమ్మవారికి ప్రమోషన్లు ఇచ్చారని సాక్షిపత్రిక, విజయసా యిరెడ్డి దుష్ప్రచారం చేశారని బుచ్చయ్య పేర్కొన్నారు. ఇద్దరే కమ్మవాళ్లుంటే, 35మంది అన్నారని, వారిలో 20మందికి జీతాలివ్వకుండా ఎందుకు వీఆర్లో పెట్టారని, అలానే 4గురు అడిషనల్ఎస్పీలను, 5గురు ఎస్పీస్థాయి అధికారుల్ని, 54మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లని ఎందుకు వీఆర్లో పెట్టారో రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్చేశారు.
రెడ్డి వర్గంలో 72మంది కీలకపదవుల్లో ఉన్నారని, వారికితోడు తెలంగాణనుంచి తీసుకొచ్చిన మరికొందరిని కూడా జగన్సర్కారు అందలమెక్కించిందన్నారు. ఇది చాలదన్నట్లు సాక్షిపత్రికలో పనిచేస్తున్నవారికి రాష్ట్రప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలివ్వడం దుర్మార్గం కాదా అని బుచ్చయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులుగా జగన్సామాజికవర్గం వారుతప్ప, ఇతరులు పనికిరారా అన్నారు. టీటీడీ లోకూడా ఇదేవిధమైన ధోరణి కొనసాగుతోందన్నారు. శాసనసభలో ప్రతిపక్షసభ్యులను మాట్లాడనివ్వకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఒకే సామాజికవర్గానికి పెద్దపీటవేసుకుంటూ, జగన్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, తానుచేసేవి నిరాధారమైన ఆరోపణలు కావని, శాఖలవారీగా జరిగిన నియామకాలను నిరూపిస్తానని ఎమ్మెల్యే గోరంట్ల సవాల్చేశారు. జగన్జమానాలో ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్లను కూడా రెడ్లకే ఇస్తారేమోనని ఎద్దేవా చేశారు. తెలుగుభాషను బొందపెట్టేలా వ్యవహరిస్తున్న జగన్సర్కారు, తెలుగుఅకాడమీ ఛైర్మన్గా లక్ష్మిపార్వతిని, యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వాళ్లను నియమించామనడం సిగ్గుచేటన్నారు. తమకు151మంది ఎమ్మెల్యేల బలముందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు.
Comments
Post a Comment