హైకోర్టు తరలింపు యత్నం పై ఆందోళన
విజయనగరం: కర్నూలు జిల్లాకు హైకోర్టు తరలింపుపై విజయనగరం లాయర్లు గురువారం ఉదయం నిరసనకు దిగారు. కర్నూలులో హైకోర్టు తరలింపు వల్ల ప్రజలు, లాయర్లకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని లేదంటే విశాఖలో పెట్టాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో ఒక రాష్ట్రం... మూడు రాజధానులంటూ సీఎం జగన్ మోహన్రెడ్డి సరికొత్త ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం... హైకోర్టు ఏర్పాటుతో న్యాయ రాజధానిగా కర్నూలు... శాసనసభ, శాసన మండలితో 'చట్ట సభల రాజధానిగా విజయవాడ ఉండొచ్చు అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment